విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్
విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు ధర్నా చేపట్టారు.
విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు ధర్నా చేపట్టారు. విద్యార్థులు కలెక్టరేట్ లోపలకు దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది. పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.