సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ను ఏపీ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. ఆయనను ప్రభుత్వ సలహాదారు(నేషనల్ మీడియా మరియు పొరుగురాష్ట్రాలతో సంబంధాలు)గా నియమించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ. సీసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. అమర్ 1975లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం స్టాప్ కరస్పాండెంట్గా, సహాయ సంపాదకుడిగా, సంపాదకుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఓ ఛానల్ లో కన్సల్టింగ్ జర్నలిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.