టీడీపీ సీనియర్ నేత, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే ఎం.సురాజ్ వైసీపీలో చేరనున్నట్టు సమాచారం.1983, 1994 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సురాజ్ 1997లో లక్ష్మీపార్వతి పార్టీలో చేరారు. ఆ తరువాత కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్లారు.కాంగ్రెస్ లో ఉంటూనే వైసీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ పార్టీ నేత ఆదిమూలం ఆయన ప్రయత్నాలకు గండికొట్టారు. దీంతో గతనెల 15వ తేదీన నెల్లూరులో ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే సత్యవేడు టీడీపీ అబ్యర్థిగా జేడీ రాజశేఖర్ను టీడీపీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ పరిణామంతో సురాజ్ టీడీపీ రెబల్గా నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీలో చేరి నెల రోజులు కూడా కాకముందే ఆయన వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.