సత్తెనపల్లి ఘటనలో ఎస్సైని సస్పెండ్‌ చేశాం: ఐజీ

Update: 2020-04-20 07:16 GMT

పోలీసుల దెబ్బలు తాళలేక సత్తెనపల్లిలో గౌస్ అనే యువకుడు మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై ఐటీ ప్రభాకర్‌రావు స్పందించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయటకు వచ్చిన గౌస్‌ను ఆపేందుకు ఎస్సై రమేశ్‌ ప్రయత్నించారని ఐజీ చెప్పారు. అప్పటికే అతడికి చెమటలు పట్టి కిందపడిపోయాడని వివరించారు. వెంటనే సమీపంలోని ఆస్ప్రతికి తరలించారని.. అప్పటికే మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు. ఎస్సై రమేశ్‌బాబును సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. అయితే పోలీసుల దాడిలో అతడు మృతిచెందాడని ప్రచారం జరుగుతోందని... దీనిపై నిజానిజాలను తేల్చి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ తెలిపారు.

Tags:    

Similar News