ఆంధ్రప్రదేశ్ లో జీతాలు, పింఛన్లు ఆలస్యం..

Update: 2019-08-31 02:31 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, వృద్ధులు, వితంతువుల పింఛన్లు ఈసారి రెండు రోజులు ఆలస్యం కానున్నాయి. సెప్టెంబరు నెలకు సంబంధించి సెప్టెంబరు 1 ఆదివారం కావడం, మరునాడు (2న) వినాయక చవితి కావడంతో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీంతో వరుసగా రెండురోజులు సెలవుదినాలు కావడంతో సెప్టెంబర్ 3వ తేదీ నుంచి జీతాలు,పింఛన్లు అందుతాయని ఆర్థిక శాఖ తెలిపింది. కాగా గతనెల కొన్ని సాంకేతిక కారణాలతో జీతాలు, పింఛన్లు ఆలస్యం అయినట్టు అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News