Sajjala Ramakrishna Reddy: కుప్పంలో చంద్రబాబు పర్యటన డ్రామాలా జరుగుతోంది

Sajjala Ramakrishna Reddy: కుప్పంలో చంద్రబాబు పర్యటనంతా ఒక డ్రామాలా జరుగుతోందని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Update: 2022-08-25 14:16 GMT

Sajjala Ramakrishna Reddy: కుప్పంలో చంద్రబాబు పర్యటన డ్రామాలా జరుగుతోంది

Sajjala Ramakrishna Reddy: కుప్పంలో చంద్రబాబు పర్యటనంతా ఒక డ్రామాలా జరుగుతోందని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గొడవ చేసేది వాళ్లే.. వీరంగం సృష్టించేది వాళ్లే.. తిరిగి వైసీపీని పోలీసులను తిట్టేది వాళ్లేనంటూ మండిపడ్డారు. కుప్పంలో జరిగిన అల్లర్లకు చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు సజ్జల. సీఎం జగన్‌ పాలనలో కుప్పం ప్రజలు అభివృద్ధిని చూశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కకావికలమైందన్నారు. ప్రజల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదన్నారు. చంద్రబాబు సేవ చేస్తే ప్రజలు ఆయన గురించి ఆలోచిస్తారన్నారని సజ్జల అన్నారు.

Tags:    

Similar News