నిమ్మగడ్డ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు- సజ్జల

*పరిధి దాటి అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు- సజ్జల *అధికారుల పట్ల ఎస్‌ఈసీ వ్యవహార శైలి ఆక్షేపణీయం- సజ్జల

Update: 2021-01-29 09:51 GMT

నిమ్మగడ్డ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు- సజ్జల

నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తనను ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌కు లేఖ రాయడంపై సజ్జల మండిపడ్డారు. తనకున్న అధికారాన్ని హక్కుగా భావించి పరిధి దాటి చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అధికారుల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు, వాడే భాష అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు సజ్జల.

టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్‌లా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను నిమ్మగడ్డ నమ్మకపోతే ఎలా అన్నారు. టీడీపీ గూండాలను పెట్టుకుని ఎన్నికలను జరుపుకుంటారా అంటూ సజ్జల ప్రశ్నించారు.

Tags:    

Similar News