Sajjala Ramakrishna Reddy: ఎన్టీఆర్‌ మరణానికి చంద్రబాబే కారణం..

Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Update: 2022-09-02 14:10 GMT

Sajjala Ramakrishna Reddy: ఎన్టీఆర్‌ మరణానికి చంద్రబాబే కారణం..

Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని..ఎన్టీఆర్ మరణానికే చంద్రబాబే కారణమని సజ్జల ఆరోపించారు. ప్రస్తుతం ఆయన వెంట టీడీపీ అంతా ఢొల్లేనని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక విఫల నాయకుడు.. కుప్పం నియోజకవర్గాన్ని కూడా నిలుపుకోలేక పోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తాను మొదటి సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజును ఘనంగా నిర్వహించుకున్నారు. మొదటి సారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో, పదవి కోసం పన్నిన కుట్రలు కూడా ప్రజలకు చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News