ఊహించిన విధంగానే ఫలితాలొచ్చాయి- సజ్జల

*సీఎం జగన్ అమలు చేసిన పథకాలకు ఎన్నికల ఫలితాలు నిదర్శనం *ముందు ఊహించిన విధంగానే ఫలితాలొచ్చాయి- సజ్జల *ఇప్పటివరకు 81శాతానికి పైగా వైసీపీ మద్దతుదారులు గెలిచారు

Update: 2021-02-10 11:44 GMT

సజ్జల ఫైల్ ఫోటో 

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముందు ఊహించిన విధంగా వచ్చాయని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. సీఎం జగన్ అమలు చేసిన పథకాలకు ఎన్నికల ఫలితాలు నిదర్శమని తెలిపారు. ఇప్పటివరకు 81శాతానికి పైగా వైసీపీ మద్దతుదారులు గెలిచారన్నారు. టీడీపీ వాళ్లు కూడా వైసీపీకి మద్దతు తెలిపారని వెల్లడించారు. ఈఎస్‌సీ నిమ్మగడ్డ అధికారులను భయపెట్టారని ఆరోపించారు. చంద్రబాబువి అన్నీ కుట్రపూరిత ఆలోచనలేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.


Tags:    

Similar News