AP Employees: ఏపీ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల రౌండ్‌ టేబుల్ సమావేశాలు

AP Employees: *నేటి నుంచి ఏపీ ఉద్యోగుల పోరుబాట *పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ మొదలు...

Update: 2022-01-23 03:48 GMT

 ఏపీ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల రౌండ్‌ టేబుల్ సమావేశాలు

AP Employees:నేటి నుంచి ఏపీ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల రౌండ్‌ టేబులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పీఆర్సీ జీవోల ద్వారా జరిగే నష్టాలపై చర్చించనున్నారు. ఇక రేపు సీఎస్‌కు సమ్మె నోటీసులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. పీఆర్సీ జీవోలను ప్రభుత్వం రద్దు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Tags:    

Similar News