ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మేరకు నెల్లూరు జిల్లాలో రెండు, గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశంలో ఒకచోట రీపోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది. సీఈవీ ద్వివేది ఐదుచోట్ల రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. అటు... నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలంపై ఈసీ సీరియస్ అయ్యింది. ఆర్వో, ఏఆర్వోలపై FIR నమోదు చేయాలని ఆదేశించింది. కాగా ఇక్కడ గొడవల కారణంగా పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో రీపోలింగ్ నిర్వహణ అనివార్యమైంది.