కల్యాణి డ్యాం వద్ద ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కల్యాణి డ్యాం వద్ద రవాణా కు సిద్దంగా ఉన్న 36 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Update: 2020-12-25 07:03 GMT

కల్యాణి డ్యాం వద్ద రవాణా కు సిద్దంగా ఉన్న 36 ఎర్రచందనం దుంగలు స్వాధీనం వాహనం సీజ్ చేసి ఒక స్మగ్లర్ ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్

భాకరాపేట మార్గం లో కల్యాణి డ్యాం సమీపంలో వాహనం లోకి ఎక్కించి అక్రమ రవాణా కు సిద్ధంగా ఉన్న 36 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. ఒక స్మగ్లర్ ను అరెస్ట్ చేయడంతో పాటు ఒక గూడ్స్ క్యారియర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ లింగాధర్, ఎఫ్ బి ఓ లు జానీ బాషా, కోదండం బృందం గురువారం మధ్యాహ్నం నుంచి భాకరాపేట అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. అక్కడ నుంచి కల్యాణి డ్యాం మీదుగా వస్తుండగా, తెల్లమరం అనే ప్రాంతంలో రాత్రి 2.00 గంటల సమయంలో స్మగ్లర్లు అలికిడి వినిపించింది.

 దీంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు. పోలీసులను చూసిన దాదాపు 40 మంది స్మగ్లర్లు దుంగలు పడేసి చీకటి లో పారి పోయారు. అయితే ఒక స్మగ్లర్ ను పట్టుకో గలిగారు. సమీపంలో లోడింగ్ కు సిద్దంగా ఉన్న వాహనం కనిపించింది. వాహనం లో ఎరువులకు సంభందించిన బస్తాలు ఉన్నాయి.

 ఎర్రచందనం దుంగలను వాహనం లో ఎక్కించి, వాటి పైన మూటలు వేసి రవాణా చేయనున్నట్లు పట్టు బడిన స్మగ్లర్ తెలిపాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకటయ్య మాట్లాడుతూ స్మగ్లర్ ను తమిళనాడు తిరువన్నామలై జిల్లా, చెంగం తాలూకా, పాంబత్తూరుకు చెందిన కుమార్ (25)గా గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన స్మగ్లర్లు కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్ చేరుకోగా, సిఐ సుబ్రహ్మణ్యం పరిస్థితి సమీక్షించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News