రేషన్ కార్డుల సర్వేను పక్కాగా నిర్వహించండి

రేషన్ కార్డుల సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని పౌరసరఫరాల డిప్యూటీ తాసిల్దారు మోహన్ నాయక్ వాలంటీర్లకు తెలిపారు.

Update: 2019-11-29 04:18 GMT
డిప్యూటీ తాసిల్దారు మోహన్ నాయక్, ఎంపీడీవో రఘునాథ్ గుప్తా, వైకాపా మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి

ఓబులదేవరచెరువు: రేషన్ కార్డుల సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని పౌరసరఫరాల డిప్యూటీ తాసిల్దారు మోహన్ నాయక్ వాలంటీర్లకు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన వాలంటీర్ల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. గ్రామాలలో రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

గడువులోపు కుటుంబ సభ్యులు వివరాలతో నమోదు చేయాలన్నారు. తప్పులకు ఆస్కారం లేకుండా చూడాలని ఏమైనా తప్పులు నమోదు చేసే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఘునాథ్ గుప్తా, వైకాపా మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



Tags:    

Similar News