PUBG: నూజివీడులో రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన పబ్జీ

PUBG: బాహాబాహీకి దిగిన పబ్జీ ఆడిన విద్యార్థులు * గొడవలో జోక్యం చేసుకున్న రెండు గ్రామల పెద్దలు

Update: 2021-03-03 14:23 GMT

Representational Image

PUBG: నూజివీడులో పబ్జీ ఆటలో చెలరేగిన వివాదం రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. నూజివీడులోని సిద్దార్ధనగర్ విద్యార్థులు పబ్జీ ఆడారు. ఈ నేపథ్యంలో వారి మధ్య మాటా మాటా పెరిగి బాహాబాహాకి దిగారు. ఈ గొడవ కాస్తా ముదిరి. పరస్పర దాడులకు దారి తీసింది. ఇందులో పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. గ్రామస్తులు కర్రలు ,రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ గొడవలో ఇద్దరు గాయాలపాలయ్యారు. 

Tags:    

Similar News