వెల్డన్ సిద్ధార్థ్..
వెల్డన్ సిద్ధార్థ్.. వెల్డన్ సిద్ధార్థ్.. వెల్డన్ సిద్ధార్థ్.. వెల్డన్ సిద్ధార్థ్.. వెల్డన్ సిద్ధార్థ్..
ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. వెల్డన్ సిద్ధార్థ్ అంటూ ఎస్పీని ప్రశంసించారు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న స్పందన కార్యక్రమం సమస్యల పరిష్కారం దిశగా సాగుతోంది. ప్రతి అప్లికేషన్ ను క్షున్నంగా పరిశీలించి అర్జీదారులకు సమాధానం ఇస్తున్నారు అధికారులు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆలోచన వల్ల స్పందనలో మరో అడుగు ముందుకు పడింది. భూ వివాదాలపై వచ్చే ఫిర్యాదులకు ఐదు రోజుల్లో పరిష్కారం చూపించాలని ప్రభుత్వం, అధికారులు ప్రణాళిక తెచ్చింది. దీంతో సోమవారం ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి 20 భూ వివాదాల ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. వాటిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి పంపింది ప్రభుత్వం.. దాంతో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్లు వీటిపై మరుసటి రోజే చర్చించి.. బుధవారం నుంచి పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అర్జీదారుల సమస్య సత్వరమే పరిష్కారం కానుంది. ఈ విషయంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ చూపిన శ్రద్ధకు సీఎం జగన్ వెల్డన్ అంటూ అభినందించారు.