సాహో ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆదివారం సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చెన్నైలో ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో ప్రభాస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడులో వైఎస్ జగన్ను పొలిటికల్ బాహుబలిగా చూస్తారు.. మరి మీకు జగన్ పాలనా ఎలా అనిపిస్తుంది.. అంటూ ప్రభాస్ను ప్రశ్నించగా... దానికి ఆయన ఈ విధంగా బదులిచ్చారు. 'నాకు పాలిటిక్స్ అంతగా తెలియవు. కానీ ఆయన బాగానే పరిపాలిస్తున్నాడని అనుకుంటున్నాను. ఆయన యంగ్ సీఎం.. వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగుంటుందనుకుంటున్నా' అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.