Eluru: రెడ్ జోన్ ప్రాంతంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన పోలీసులు

Update: 2020-04-16 07:56 GMT

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ కరీముల్లా షరీఫ్ తంగెళ్ళమూడి ప్రాంతంలో రెడ్ నందు ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాల వారికి సామాజిక దూరాన్ని పాటిస్తూ వారికి ఆహార పదార్థాలు, కూరగాయలను పంపిణీ కార్యక్రమంలో స్వయముగా పాలు పంచుకొని సదరు ప్రాంతంలో నివసిస్తున్న నిండు గర్భిణీ.

కుటుంబానికి అదనపు ఎస్పీ స్వయంగా కూరగాయలు సరఫర చేశారు. రెడ్ జోన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు బయటకు రాకూడదు అనే నిబంధనలు ఉండటం వలన సదరు ప్రాంతంలో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులను దాత ల యొక్క సహకారంతో ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ కార్యక్రమంను నిర్వహించినారు.


Tags:    

Similar News