Coronavirus: రెడ్‌ జోన్‌లో విధులు.. కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌

Update: 2020-04-22 09:04 GMT

కరోనా వైరస్‌ ఎవర్నీ వదలడం లేదు. అందరిని వెంటాడుతూ చంపేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా కడపలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు కరొనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 2వ పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. రెడ్‌ జోన్‌లో విధులు నిర్వహిస్తున్న తరుణంలోనే ఆ కానిస్టేబుల్‌కు కరోనా సోకి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

కడపలోని రెడ్‌ జోన్‌ ప్రాంతంలో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉంది. ఆ కానిస్టేబుల్‌ ఎవరిని కలిశాడు, ఏయే ప్రాంతాల్లో తిరిగాడు అనే వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 813కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 24 మంది మరణించారు, 120 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 669గా ఉంది.

Tags:    

Similar News