ఇవాళ భీమవరం రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో అల్లూరి జయంతి ఉత్సవాలు

Update: 2022-07-04 00:54 GMT

ఇవాళ భీమవరం రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Narendra Modi: పశ్చిమగోదావరిజిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. కేంద్రప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఆజాదికా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు.

అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలు సందర్భంగా భీమవరంలో పండుగ వాతావరణం నెలకొంది. మన్యం వీరునిపై కళాకారులు తమదైన శైలిలో అభిమానాన్ని చాటకున్నారు. విష్ణు కళాశాల ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు రూపాన్ని ఇసుకపై చిత్రీకరించారు. విష్ణు కళాశాల ప్రాంగణంలో రూపొందించిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది.  

Tags:    

Similar News