అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎరిడికెర గ్రామంలోని పంటపొలాల్లో ఒక జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇంధన సమస్యే అత్యవసర ల్యాండింగ్కు కారణంగా తెలుస్తోంది. జిందాలు కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు బళ్లారి నుంచి బెంగుళూరు వెళ్తుండగా విమానంలో ఇంధన సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు తెలుస్తోంది.