Pawan Kalyan: ఇవాళ రాజమండ్రిలో పవన్ కల్యాణ్ పర్యటన
Pawan Kalyan: కాసేపట్లో జనసేన ముఖ్యనేతలతో సమావేశం కానున్న పవన్
Pawan Kalyan: ఇవాళ రాజమండ్రిలో పవన్ కల్యాణ్ పర్యటన
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్నారు. నిన్న రాత్రి రాజమండ్రికి ప్రత్యేక విమానంలో చేరుకున్న పవన్ కల్యాణ్ కాసేపట్లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. టీడీపీతో సీట్ల సర్ధుబాటు, ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే రాజానగరం, రాజోలు నియోజక వర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చిన పవన్ కల్యాణ్ ..రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్న అంశంపై చర్చించనున్నారు.