జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ విరామం ప్రకటించారు. సత్తెనపల్లి, తెనాలి నియోజకవర్గాల్లో జరగాల్సిన ప్రచార సభలను రద్దు చేసుకున్నారు. నిన్న(శుక్రవారం) వడదెబ్బతో కిందపడ్డ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన డీహైడ్రేషన్కు గురయ్యారు. విజయనగరం పర్యటన ముగించుకుని హెలికాప్టర్లో వస్తుండగా బాగా నీరసించిపోయారు.
దీంతో, గన్నవరం ఎయిర్పోర్టులోని ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం ఆయుష్ ఆస్పత్రికి పవన్ వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకున్న అనంతరం రాత్రికి డిశ్చార్చి అయ్యారు. మరోవైపు తనకేం కాలేదని అభిమానులెవరు ఖంగారు పడాల్సిన పని లేదని కోరారు.