ఎస్వీబీసీ సీఈవో పోస్టు భర్తీకి నోటిఫికేషన్
ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్(svbc) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నియామకానికి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్(svbc) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నియామకానికి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మరికొద్ది రోజుల్లో svbc ఛానల్ కు నూతన సీఈవో రానున్నారు.. మూడేళ్ల కాలపరిమితితో svbc సీఈవోను నియమించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన అర్హతలు, నియమనిబంధనలు కూడా svbc అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని 'www.svbcttd.com' వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొంది.
వాస్తవానికి మొన్నటివరకూ ఎస్వీబీసీ సీఈవోగా పనిచేసిన నగేష్ గత ఏడాది జూన్ నెలాఖరున పదవీ కాలం ముగిసింది, అయితే మరికొంతకాలం తనను ఈ పదవిలో కొనసాగించాలని టీటీడీని అభ్యర్ధించారు. దాంతో ఆయన అభ్యర్థన మేరకు టీటీడీ పాలక మండలి ఇప్పటి దాకా పొడిగించింది. తాజాగా సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఎస్వీబీసీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.