విశాఖ జిల్లా భీమిలిలోని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెస్ట్హౌస్కు నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో కూల్చేస్తామని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. బీపీఎస్కి దరఖాస్తు చేసినా తిరస్కరించారు. కోర్టు ఆదేశాలున్నా పట్టించుకోలేదు. శుక్రవారం ఉదయం గెస్ట్హౌస్ కూల్చివేయనున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.