పోలవరం దగ్గర గోదావరి వరద.. తీవ్ర రూపం దాల్చింది. స్పిల్ వే నిర్మాణాన్ని పూర్తిగా ముంచెత్తింది. నిర్మాణ ప్రాంతం అంతా.. వరదమయం అయ్యింది. దీంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. పైడిపాక గ్రామంలో ఇళ్లన్నీ మునిగిపోయాయి. దీంతో ఎత్తైన కొండ ప్రాంతాలకు ప్రజలు వెళ్తున్నారు. గత వారం రోజులుగా పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇటు సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలవరం చేరుకున్నాయి.