NDA: చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ నేతల భేటీ.. కీలక అంశాలపై చర్చ..

NDA: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ ముగిసింది. సీట్ల మార్పుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Update: 2024-04-12 13:15 GMT

NDA: చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ నేతల భేటీ.. కీలక అంశాలపై చర్చ..

NDA: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ ముగిసింది. సీట్ల మార్పుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అనపర్తి, ఉండి స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనపర్తి స్థానం టీడీపీకి ఇవ్వాల్సి వస్తే.. ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను బీజేపీ సిద్ధం చేసినట్లు సమాచారం. తంబళ్లపల్లె, ఏలూరు లేదా రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఏదైనా ఒకస్థానం బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయ లోపంపై కూడా చర్చించారు. మూడు పార్టీల నేతల మధ్య సమన్వయ లోపం... ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం నేతల్లో నెలకొంది. వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడిగా.. మూడు పార్టీల ముఖ్యనేతలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు.

Tags:    

Similar News