ఏపీ ప్రజలకు మంచి జరగాలంటే బాబు మల్లి రావాలి అని అన్నారు సినీనటుడు నారా రోహిత్. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఆయన రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థి మాగంటి రూప, రాజానగరం అసెంబ్లీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్లతో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. ఏపీ మంచి చేసే నాయకుడు చంద్రబాబునాయుడని.. ఆంధ్రా ప్రజలు ఆయనను మరచిపోరన్నారు. అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందించారని, వాటిని అందుకున్న ప్రతీ ఒక్కరూ టీడీపీకి ఓటెయ్యడానికి సిద్ధంగా నారా రోహిత్ అన్నారు.