యావజ్జాతిని అవమానిస్తారా? : ఎంపీ విజయసాయిరెడ్డి

Update: 2019-08-22 11:49 GMT

ఏపీ సీఎంను ఉద్దేశించి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఉద్దేశించి కులం పేరుతో దూషించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబు గారూ. జూనియర్ ఆర్టిస్టులను వరద బాధితులుగా యాక్షన్ చేయించి ప్రభుత్వాన్ని తిట్టిస్తారా? యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కులం, వృత్తిని ధూషించి యావజ్జాతిని అవమానిస్తారా?' అంటూ పేర్కొన్నారు. అలాగే నిన్న రాత్రి అరెస్టైన చిదంబరంను ఉద్దేశించి కూడా బాబును విమర్శిస్తూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'బాబు గారు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాధృచ్ఛికమేమీ కాదు. పాద మహిమ అలాంటిది. ఇప్పుడు చిదంబరం గారికి పీకల్లోతు కష్టాలొచ్చాయి. ఎన్సీపీ ఎమ్మెల్యులు పార్టీ మారుతుంటే శరద్ పవార్ గారు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయి.'

Tags:    

Similar News