పిఎంఓ అధికారులతో ఎంపీ విజయసాయి, అజేయ కల్లామ్ భేటీ

Update: 2019-08-23 07:28 GMT

పిఎంఓ అధికారులతో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఆయన తోపాటు ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లామ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు అంశాలపై వారు చర్చించారు. గత ప్రభుత్వం ఈ రెండింటిలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే పోలవరం హైడల్ ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో పిఎంఓ అధికారులకు దీనిపై పూర్తి సమాచారాన్ని అందించనున్నారు. అలాగే పోలవరంపై రివర్స్ టెండరింగుకు అనుమతులు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఇదివరకే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రివర్స్ టెండరింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఉన్న సందేహాలను పిఎంఓ అధికారులకు ఈ బృందం వివరించినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News