ఇకపై ఆంధ్రప్రదేశ్ కు నాలుగు రాజధానులు : ఎంపీ టీజీ వెంకటేష్
ఇకపై ఆంధ్రప్రదేశ్ కు నాలుగు రాజధానులు ఇకపై ఆంధ్రప్రదేశ్ కు నాలుగు రాజధానులు
ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్. జగన్ ప్రభుత్వం రాజధాని మార్పుపై కేంద్రంతో చర్చిందన్నారు. ఇకపై ఏపీకి నాలుగు రాజధానులు ఉంటాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. అవి.. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప ప్రాంతాలన్నారు. ఇది నూటికి నూరు శాతం జరిగి తీరుతుందని కూడా స్పష్టం చేశారు. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే అమరావతిలోని రియల్టర్లు, కొందరు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న తరుణంలో.. ఎంపీ టీజీ చేసిన వ్యాఖ్యలు వారిని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి.