RRR: ప్రధాని మోడీ కి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

RRR: ఏపీ ప్రభుత్వం అర్హతకు మించి అప్పులు చేసుంది, రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతుంది - రఘురామకృష్ణంరాజు

Update: 2021-06-16 13:49 GMT

RRR: ప్రధాని మోడీ కి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

RRR: ప్రధాని మోడీ కి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అర్హతకు మించి అప్పులు చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్ఐడీసీకి బదిలీ చేసి మరీ రుణాలు సేకరిస్తుందని తెలిపారు.

ఉచిత పథకాలకు మరో మూడు వేల కోట్ల రుణం తీసుకు వచ్చేందుకు బ్యాంకులతో ప్రభత్వం సంప్రదిస్తుందని చెప్పారు. ఇప్పటికే దుబాయ్ కు చెందిన లులు సంస్థకు విశాఖలో కేటాయించిన భూములు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రజా సంక్షేమం ముసుగులో స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు రఘురామ కృష్ణరాజు.  

Full View


Tags:    

Similar News