Krishna Devarayalu: ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధులపై కేంద్రాన్ని నిలదీస్తాం

*పోలవరం పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది -కృష్ణదేవరాయలు *వరద బాధితులను కేంద్రం ఆదుకోవాలి -కృష్ణదేవరాయలు

Update: 2021-11-26 10:15 GMT

కృష్ణదేవరాయలు(పేస్ బుక్ ఫోటో )

Krishna Devarayalu: ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధులు రాబట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు ఎంపీ కృష్ణదేవరాయలు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లాభాల్లో ఉంది. దానిని ప్రైవేటీపరం చేయొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు.

30ఏళ్ల తర్వాత రాయలసీమలో భారీ వరదలు వచ్చాయని, బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని ఆయన గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రపై ఉందని, అందుకు అవసరమైన నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తామంటున్నారు ఎంపీ కృష్ణదేవరాయలు.

Tags:    

Similar News