ముఖ్యమంత్రి జగన్ ఇంటివద్ద ఆత్మహత్య చేసుకుంటా : బుద్ధా వెంకన్న

Update: 2019-08-18 09:43 GMT

ముఖ్యమంత్రి జగన్ ఇంటివద్ద ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. చంద్రబాబు ఇంటిమీదకు డ్రోన్ లు పంపడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆయన అందుకోసమే ఆయన ఇంటిని డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీశారని అన్నారు. మంత్రులు కూడా చంద్రబాబు ఇంటివద్ద రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏమైనా అయితే సీఎం జగన్ ఇంటివద్దే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు బుద్ధా వెంకన్న. అలాగే చంద్రబాబు భద్రతపై ప్రధాని, హోంమంత్రికి లేఖరాస్తానని.. చంద్రబాబుకు కేంద్రమే రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లంక గ్రామాల‌ ప్రజలు ఇబ్బందులను గాలికి వదిలేశారని.. ఏపీలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం జగన్ అమెరికాలో ‌విలాశవంతమైన జీవితం గడుపుతున్నారని వెంకన్న విమర్శించారు.

Tags:    

Similar News