చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి సవాల్.. ఆధారాలు చూపించకుంటే..

Update: 2019-11-13 11:31 GMT

ఇసుక ఎక్కడ అక్రమంగా రవాణా చేశానో ఆధారాలు చూపించాలని చంద్రబాబు కు సవాల్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి. సాయంత్రంలోగా ఆధారాలు చూపించాలి లేదంటే రేపు (గురువారం) చంద్రబాబు చేసే దీక్ష పక్కనే దీక్ష చేస్తానన్నారు. చంద్రబాబు ఇసుక దీక్ష చేయడం విడ్డురంగా ఉందన్నారు పార్థసారధి. పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు నాటకాలడుతున్నారన్నారు పార్థసారధి. టీడీపీ, జనసేన ఒకే తానులో ముక్కలు' అని మండిపడ్డారు. మరోవైపు విజయవాడలో ధర్నా చౌక్‌ వద్ద రేపు ధర్నా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్థసారధి నగర పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు.

Full View

Tags:    

Similar News