వారినుంచి ప్రాణహాని ఉంది భద్రత కల్పించండి : వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

Update: 2019-08-18 10:40 GMT

తనపై సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. టీడీపీకి చెందిన 'నాని చౌదరి, లోకేష్ టీమ్ పేరుతో సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెడుతున్నారని.. చెన్నై టీడీపీ ఫోరమ్ పేరుతో అనుచిత వ్యాఖ్యలతో అసభ్యకర పోస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపుతామని.. తనని చంపుతామని.. మంగళగిరి నుంచి తరిమి కొడతామని వారు హెచ్చరించినట్టు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ లను ఆయన పోలీసులకు సమర్పించారు. అంతేకాదు తనకు ప్రాణహాని ఉంది. భద్రత కల్పించాలని ఫిర్యాదులో పొందుపరిచినట్టు ఆర్కే చెప్పారు. తన నియోజకవర్గంలోనే చంద్రబాబు నివాసం ఉన్నందువలన పర్యటించానని ఆర్కే చెప్పారు. అయితే తాను బాబు నివాసంలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు.  

Tags:    

Similar News