మంత్రి కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

Update: 2020-01-15 09:29 GMT
మంత్రి వనిత కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

సంక్రాంతి పండగ వేళ పశ్చిమ గోదావరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వైసీపీ నేత, మంత్రి తానేటి వనిత తన కాన్వాయ్‌తో భీమడోలు రహదారిపై వెళ్తోంది. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఆమె కాన్వాయ్‌‌లోని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం అదుపుతప్పగా ఆ వెంటనే మంత్రి ఇన్నోవా కారు కూడా ఢీకొట్టి రహదారి డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంత్రి వనిత స్వల్ప గాయాలతో బయటపడగా ద్విచక్రవాహనంపై ఉన్న వృద్ధుడు మాత్రం తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని భీవవరానికి చెందిన వెంకటరామయ్యగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News