ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో టీడీపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ బెస్ట్ అని స్వీట్లు పంచుకోలేదా అని ప్రశ్నించారు. ఆనాడు మోడీని తిట్టి ఇప్పుడు ఆయన స్నేహం కోసం వెంపర్లాడుతున్నారని ఇచ్చిపుచ్చుకోవడంలో టీడీపీకి మించిన వారు లేరని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు.