గంటాను వైసీపీలో చేర్చుకోవడంపై మంత్రి అవంతి స్పందన

Update: 2019-08-31 01:45 GMT

విశాఖ జిల్లాకు చెందిన ఓ పెద్దమనిషికి సీఎం జగన్ డోర్లు మూసేశారని, అందుకే విశాఖను ఆర్ధిక రాజధానిని చెయ్యాలని అంటున్నాడని పరోక్షంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి మాట్లాడారు మంత్రి అవంతి శ్రీనివాస్. రాజధానిని మార్చే ఉద్ద్యేశం సీఎంకు లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. అమరావతిపై గతంలో ఏం మాట్లాడారో పవన్‌ కళ్యాణ్ గుర్తు తెచ్చుకోవాలన్నారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ పునర్విచారణకు ఆదేశాలిచ్చినట్టు మంత్రి తెలిపారు. టీడీపీ హయాంలో ఇసుక సహా పంచభూతాలు దోపిడీ అయ్యాయన్న అవంతి.. ఇప్పుడు ఇసుక కోసం ధర్నాలు చెయ్యడం విడ్డురమన్నారు.  

Tags:    

Similar News