Anil Kumar: ఆసరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి అనిల్ కుమార్

*రెండోసారి ఆసరా ద్వారా పేదలకు 6,400 కోట్లు -అనిల్ కుమార్ *ప్రతిపక్ష నాయకులు పథకాలకు అడ్డుపడుతున్నారు -మంత్రి

Update: 2021-10-09 11:19 GMT

అనిల్ కుమార్(ఫోటో- ది హన్స్ ఇండియా)

Anil Kumar: రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అమలు చేస్తున్న ఆసరా పథకాన్ని మంత్రి అనిల్ కుమార్ నెల్లూరులో ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దాదాపు 6 వేల 400 కోట్ల రూపాయలను రెండోసారి ఆసరా ద్వారా పేదలకు అందజేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అనేక పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 

Tags:    

Similar News