ఫోనీ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-కామాఖ్య (07149) స్పెషల్ రైలును నేడు (శుక్రవారం) రద్దు చేయగా.. పూరి-తిరుపతి (17479)రైలును రద్దు చేసినట్లు సీపీఆర్ఓ సీహెచ్. రాకేష్ తెలిపారు. కాగా ఫోనీ తుఫాను ధాటికి ఒడిశాలోని లొత్తట్టు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టడంతో ఆస్తి, ప్రాణనష్టం భారీగా తప్పింది. ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదు.