ప్రియురాలు చికెన్‌పకోడి తినలేదని ప్రియుడు ఆత్మహత్య

Update: 2019-08-21 04:39 GMT

ప్రియురాలు చికెన్ పకోడీ తినలేదన్న కారణంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. ధనియాలపేటకు చెందిన తెర్లి శ్రీనివాసరావు(25) మత్య్సశాఖలో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కొన్నాళ్లకిందట అదే ప్రాంతానికి చెందిన వివాహిత ఝాన్సీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే రాత్రి శ్రీను తాను తెచ్చుకున్న చికెన్‌ పకోడిని తినాల్సిందిగా ఝాన్సీని కోరాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో తనపై ప్రేమ లేదని సోమవారం రాత్రి ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఝాన్సీ తనకుమార్తెను స్కూలుకి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు శీను. వెంటనే ఝాన్సీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

Tags:    

Similar News