Nara Lokesh: కార్యకర్తలు మృతి చెందడం పార్టీకి తీరని లోటు
Nara Lokesh: మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన లోకేష్
Nara Lokesh: కార్యకర్తలు మృతి చెందడం పార్టీకి తీరని లోటు
Nara Lokesh: కందుకూరు సభలో జరిగిన విషాద సంఘటపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యలతో సమానమైన కార్యకర్తలు మృతి చెందడం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వారు త్వరలో కోలుకోవాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు.