Tirumala: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో చిరుత సంచారం

ఏనుగుల ఆర్చ్‌ సమీపంలో భక్తుల కంటపడ్డ చిరుత భయంతో పరుగులు పెట్టిన భక్తులు చిరుత కదలికలను సెల్‌ఫోన్లలో బంధించిన భక్తులు

Update: 2021-07-11 15:11 GMT

చిరుత (ఫైల్ ఫోటో) 

Tirumala: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో మరోసారి చిరుత హల్‌చల్‌ చేసింది. ఏనుగుల ఆర్చ్ సమీపంలో రోడ్డుపై భక్తుల కంటపడింది చిరుత పులి. చిరుతను చూసిన భక్తులు తీవ్ర భయంతో పరుగులు తీశారు. చిరుత కదలికలను సెల్‌‌ఫోన్లలో బంధించి, అటవీశాఖ, టీటీడీ సిబ్బందికి సమాచారమిచ్చారు. గత కొన్నిరోజులుగా శ్రీవారి కొండపై చిరుత పులులు సంచరిస్తున్నాయి. దీంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అటవీశాఖ, టీటీడీ అధికారులు.

Tags:    

Similar News