కర్నూలు జిల్లా కరిడికొండలో చిరుతపులి సంచారం
Kurnool: భయాందోళనలో కరిడికొండ గ్రామస్థులు, రైతులు
కర్నూలు జిల్లా కరిడికొండలో చిరుతపులి సంచారం
Kurnool: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరిడికొండలో చిరుతపులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొండ చరియాల్లో చిరుతను చూసిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. గత కొద్దిరోజుల నుంచి కొండ శివారులలో అప్పుడప్పుడు చిరుతపులులు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎటువైపు నుంచి చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.