జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుస్తుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే లగడపాటి సర్వేపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. 'చంద్రబాబు స్కెచ్ లో భాగమే లగడపాటి సర్వే. 23న కౌంటింగ్ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే ... గెలుస్తామని లగడపాటి చెప్పాడు అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఈ గోల. ఆంధ్రా ఆక్టోపస్ కాదు... ఇది ఎల్లో జలగ!' అంటూ ట్విట్టర్ వేదికగా లగడపాటి రాజగోపాల్ పై మండిపడ్డారు విజయసాయిరెడ్డి.