చంద్రబాబు నివాసానికి పొంచిఉన్న వరద ముప్పు

Update: 2019-08-14 06:19 GMT

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. కరకట్టమీదకు స్వల్పంగా నీరు వచ్చేసింది. దీంతో చంద్రబాబు ఇంట్లోకి నీళ్లు రాకుండా నివాసం దగ్గర ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. స్టోన్ క్రష్ ఇసుక బస్తాలతో వరద రాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ను హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించినట్టు తెలుస్తోంది. వరద మరింత పెరిగితే చంద్రబాబు ఇంట్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉండటంతో ముందస్తు చర్యలు చేపడుతున్నారు ఆ పార్టీ నేతలు. కాగా ప్రకాశం బ్యారేజ్‌లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. 3.07 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

Tags:    

Similar News