అనంతపురం జిల్లా కియా మోటార్స్లో కరోనా కలకలం రేగింది. ఫ్యాక్టరీ బాడీ షాప్లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బాధితుడు తమిళనాడుకు చెందినవాడని తెలుసుకున్నారు. ఈ నెల 25న కర్మాగారానికి వచ్చాడు. వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో అతడ్ని శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ప్రాంగణంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అధికారులు అతడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పరిశ్రమలో ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే విధుల్లోకి తీసుకోవాలని కియా పరిశ్రమ యాజమాన్యం సూచించింది.