ఏపీ దేవాదాయశాఖలో కీలక బదిలీలు

Update: 2019-08-21 16:18 GMT

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖలో కీలక బదిలీలు జరిగాయి. విజయవాడ దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఎంవీ సురేష్‌బాబును నియమించారు. అలాగే అన్నవరం దేవస్థానం ఈవోగా వి.త్రినాథరావు, కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న వి.దేముళ్లుకు కాణిపాకం దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే రాజమహేంద్రవరం మల్టీజోన్-1 ఆర్జేసీగా డి.భ్రమరాంబ, తిరుపతి మల్టీజోన్ ఆర్జేసీ-2గా పి.పూర్ణచంద్రరావును నియమించారు.

Tags:    

Similar News