ఏపీలో ప్రతిష్టాత్మకంగా తయారవుతున్న గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో తొలి అడుగు పడబోతోంది. సచివాలయ పదవులకు సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందులో ఎంపికైన అభ్యర్థులు శాశ్వత ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులవుతారు. ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. అభ్యర్థుల కోసం అధికారులు పలు సూచనలు చేశారు. వాటిలో..
*గంటముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
*నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
*హాల్టికెట్, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తీసుకురావాలి
*పరీక్షా కేంద్రాలను గుర్తించేందుకు ఏర్పాట్లు
*కూడళ్లు, బస్టాండ్లలో రూట్మ్యాప్లు, హెల్ప్డెస్క్లు ఏర్పాటు
*ఆన్లైన్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి
*150ప్రశ్నలకు.. 150 మార్కులు
*పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది
*నాలుగు తప్పులకు ఒక మార్కు తీసివేస్తారు
*రెండు భాషాల్లో ప్రశ్నాపత్రం
*టెక్నికల్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది
*మాల్ప్రాక్టీస్కు పాల్పడితే కస్టడీలోకి తీసుకుంటారు