Kesineni Srinivas: పవన్‌ రెండు చోట్ల ఓడిపోయి.. ఇప్పుడు జగన్‌ను ఓడిస్తానని అంటున్నారు

Kesineni Srinivas: బోండా ఉమా ఒక బ్లాక్‌ మెయిలర్‌, ల్యాండ్‌ గ్రాఫర్‌, కిడ్నాపర్‌

Update: 2024-02-29 15:15 GMT

Kesineni Srinivas: పవన్‌ రెండు చోట్ల ఓడిపోయి.. ఇప్పుడు జగన్‌ను ఓడిస్తానని అంటున్నారు

Kesineni Srinivas: పవన్‌ కళ్యాణ్‌, బోండా ఉమాపై ఎంపీ కేశినేని నాని ఫైరయ్యారు. పవన్‌ కళ్యాణ‌‌ తెలంగాణలో ఉంటూ గెస్ట్‌ ఆర్టిస్ట్‌లాగా ఏపీకి వస్తాడని ఆయన విమర్శించారు. పవన్‌కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు వద్ద పవన్‌ ముష్టి 24 సీట్లు తీసుకున్నాడని అన్నారు. పవన్‌ రెండు చోట్ల ఓడిపోయి.. ఇప్పుడు జగన్‌ను ఓడిస్తానని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.బోండా ఉమా ఒక బ్లాక్‌ మెయిలర్‌, ల్యాండ్‌ గ్రాఫర్‌, కిడ్నాపర్‌ అని తీవ్ర స్థాయిలో ఎంపీ కేశినేని నాని విరుచుకపడ్డారు. బోండా ఉమా ప్రజా జీవితానికి పనికిరాడన్నారు.

Tags:    

Similar News